కోడెల మృతి కేసు..మూడు టీమ్ లతో దర్యాప్తు చేస్తున్నాం: సీపీ అంజనీకుమార్

  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం  
  • బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో మూడు టీమ్ లు
  • క్లూస్ టీం, టెక్నికల్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో మూడు టీమ్ లు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కోడెల మృతి చెందిన ఇంటి వద్ద క్లూస్ టీం, టెక్నికల్ టీమ్ ఆధారాలు సేకరిస్తోందని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత కోడెల మృతికి గల కారణంపై స్పష్టత వస్తుందని అన్నారు.
Go Back to Shorts
Kodela siva prasad
Hyderabad
CP
Anjanikumar

More Telugu News